కందులవారిపాలెంలో ఇంటింటికి జనసేన

సత్తెనపల్లి నియోజకవర్గం: సత్తెనపల్లి రూరల్ మండలం, కందులవారిపాలెం గ్రామంలో ఆదివారం కందుల వారి పాలెం గ్రామ జనసైనికుల ఆహ్వానం మేరకు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజలకు తెలియజేసేందుకై సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ.. మన జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారాహి మొదలైన మొదటి రోజున కత్తిపూడి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి హామీ కొత్తగా పెళ్లి అయినటువంటి నూతన వధూవరులకు రేషన్ కార్డు మన ప్రభుత్వం రాగానే ఇంటి దగ్గరికి వచ్చి చేరవేస్తారు, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క ఆడపడుచుకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, రేషన్కు బదులుగా నేరుగా మహిళల ఖాతాల్లో 2500 నుండి 3500 వరకు నగదు ఇస్తామని, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎల్కేజీ నుండి పిజి వరకు ఉచితంగా విద్య, అలాగే ఇంటర్ నుండి ఉచితంగా లాప్టాప్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు. యువతకు పెట్టుబడి కింద ప్రతి నియోజకవర్గంలో 500 మందికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. రాబోయేది మన ప్రభుత్వమే అని, ప్రతి ఒక్క జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు, కౌన్సిలర్, జిల్లా నాయకులు, ప్రోగ్రాం కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ అధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొనడం జరిగినది.