సీపీఎఫ్ పరిశ్రమపై స్పందనలో జనసేన ఫిర్యాదు
నెల్లిమర్ల నియోజకవర్గం: పూసపాటిరేగ మండలం, చోడమ్మ అగ్రహారం పంచాయతీ గైతుల చోడవరంలో నిర్మించిన సీపీఎఫ్ పరిశ్రమ వలన కాలుష్యం ఎక్కువగా ఉందని సోమవారం స్పందన జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం కార్యదర్శి కారి అప్పలరాజు, మండల అభివృద్ధి అధికారి రామారావుకి వినతి పత్రం అందజేశారు. ఈ పరిశ్రమ వలన గాలి మరియు నీరు కలుషితం అవుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చోడవరం గ్రామ జనసైనికులు బాల గోవిందు మరియు గణేష్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-19-at-3.58.04-PM-1024x768.jpeg)