జనసేనానికి జడ్ ప్లస్ భద్రత కల్పించాలి..

  • ప్రధాని మోడీకి వబ్బిన సన్యాసి నాయుడు లేఖ

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు జడ్ ప్లస్ భద్రత కల్పించాలని కోరుతూ ప్రధాని మోడీకి సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ విజయనగరం జిల్లా అధ్యక్షులు వబ్బిన సన్యాసి నాయుడు లేఖ వ్రాసారు. నాకు వైసీపీ నాయకుల నుంచి ప్రాణహాని ఉందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్న కారణంగా ప్రధాని నరేంద్ర మోడి వెంటనే జడ్ ప్లస్ భద్రత కల్పించాలని వబ్బిన సన్యాసి నాయుడు ప్రధాని మోడీకి లేఖ రాశారు. వైసీపీ నాయకులు సుపారి గ్యాంగ్ లను ఏర్పాటు చేశారని పవన్ కళ్యాణ్ చెప్పారని కాపు ఉద్యమ నేత వబ్బిన సన్యాసి నాయుడు పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్ కుటుంబంకు 50 సంవత్సరాల నేర చరిత్ర ఉన్న విషయం వాస్తవమేనని, అధికారం కోసం ఏమి చేయడానికి అయినా వైసీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారని వబ్బిన సన్యాసి నాయుడుతెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎంపీ, ఐఏఎస్, ఐపీస్, జడ్జిలకు, మంత్రులకు కూడా రక్షణ లేదని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రము లోని దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాలు వైసీపీ పాలనలో రోజూ హత్యలు, మానభంగాలకు గురవుతున్నారని సన్యాసి నాయుడు లేఖలో ప్రధానికి వివరించారు. ఏపీ డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి వైసీపీ కార్యకర్తగా పనిచేస్తున్నాడు, కావున డీజీపీ నుండి తొలగించి రాష్ట్ర ప్రజలను రక్షించాలని సన్యాసి నాయుడు విజ్ఞప్తి చేశారు.