గిరిజన ప్రాంత అభివృద్ధి జనసేనతోనే సాధ్యం

  • పెదబయలు మండల జనసేన అధ్యక్షులు జాగరపు పవన్ కుమార్

అరకు నియోజకవర్గం: పెదబయలు మండలం, పంది గుంట గ్రామంలో జనసేన మండల అధ్యక్షులు పవన్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పవన్ కుమార్ కి పూలమాలతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. జనసేన పార్టీ సిద్ధాంతాలు గ్రామస్తులకు తెలియజేయడం జరిగినది. గ్రామంలో నెలకొని ఉన్న అనేక రకాల సమస్యలని అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా మంచినీరు, డ్రైనేజీ రహదారి ఇలా చాలా సమస్యలు ఉన్నాయని గ్రామస్తులు పవన్ కుమార్ గారికి తెలియజేయడం అయినది. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఇతర పార్టీలు అధికారంలోకి వస్తే గిరిజన బిడ్డలకు కష్టాలు, కన్నీరు తప్ప ఎటువంటి ఫలితం లేదని పవన్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు జై కళ్యాణ్, కుర్ర శ్రీను, రాజు, బుజ్జి, జీవను పాల్గొన్నారు.