రాయికల్ మండల జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం

  • జగిత్యాల నియోజకవర్గ జనసేన ఇంచార్జి బెక్కం జనార్థన్ అధ్వర్యంలో పార్టీలో చేరికలు..

జగిత్యాల నియోజవర్గం: జగిత్యాలలో మంగళవారం రాయికల్ మండల జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేయడం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా జగిత్యాల నియోజకవర్గ జనసేన ఇంచార్జి బెక్కం జనార్థన్ మాట్లాడుతూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమిష్టి కృషితో బలంగా ప్రణాళికతో ముందుకెళ్లాలని, ఏ సమస్య వచ్చినా కార్యకర్తలందరికీ అండగా ఉంటానని, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అన్నారు. పార్టీ బలోపేతం కోసం అందరం కలిసి కృషి చేయాలి అన్నారు. పార్టీ విధివిధానాలతో రాబోవు రోజుల్లో రాయికల్ మండలం పార్టీ బలోపేతం కోసం కష్టపడాలి అని అన్నారు. పల్లె పల్లె నా జెండా నిర్మాణ కార్యక్రమాలతో ముందుకు సాగాలని దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో భాగంగా జనసేన పార్టీ సిద్దాంతాలు, పవన్ కళ్యాణ్ గారు చేసే సేవా కార్యక్రమాలు నచ్చి ఆకర్షితులై 50మంది వీరమహిళలు, జనసైనికులు బెక్కం జనార్థన్ అధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు జగిత్యాల నియోజక వర్గం ఇంచార్జీ గా బెక్కం జనార్థన్ ను నియమించి నందుకు సంతోషం వ్యక్తం చేసి, శాలువా కప్పి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయికల్ మండలం లోని పార్టీ కార్య కర్తలు మల్లికార్జున్, శివకుమార్ బాబు, సింగాని నరేష్, రాకేష్, పవన్, శ్రీను, తిరుపతి వెంకటేష్, జగిత్యాల మండల అద్యక్షులు బొల్లి రాము, వీరమహిళల విభాగం మొగులోజి విజయ, సాతారం పద్మ, పొల్లం స్వప్న, కోరుట్లనియోజకవర్గం సీనియర్ నాయకులు గంగం అజయ్ తదిరతులు పాల్గోన్నారు.