ఈసారి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు

పాలకొండ నియోజకవర్గం వైస్సార్సీపీ పార్టీ అధినేత మరియు నాయుకులు మంత్రులు ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ పని చెయ్యకుండా అభివృద్ధి చెయ్యకుండా 175కి 175 రావాలి అని టార్గెట్ ఎందుకు పెట్టుకున్నారో అర్థం కావడం అని అలానే మళ్ళీ గెలవడం అంటే ప్రజలు తెలివితేటలు లేని వారు అనుకుంటున్నారా లేదా మళ్ళీ మోసం చేద్దామనుకుంటున్నారా ఈసారి మళ్ళీ వైసీపీకి ఓటు వేసి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరని ఎందుకంటే ఈ 5 సంవత్సరాలలో ఒక్క జాబ్ తియ్యలేదు, రాజదాని క్లారిటీ లేదు, విశాఖ రెల్వే జోన్ లేదు, సిపియస్ రద్దు లేదు ఒక్క ఇల్లు లేదు ఒక్క కార్పొరేషన్ లేదు కరెంట్ ఛార్జీల మోత, నిత్యవసర వస్తువులు ధరలు ఆకాశంలో ఉన్నాయి రైతులకి గిట్టుబాటు ధరలు లేవు కానీ రైతు కొనే ప్రతి వస్తువుపైనా అధికధరలు. ఏమి లాభం? ఇంకా ఎందుకు వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఎలాంటి ఉపయోగం లేదు. పైగా హత్యలు కిడ్నాప్ లు ఎక్కువ అయ్యాయని జనసేన జానీ అన్నారు. జగన్ ప్రభుత్వం దిగిపోవాలి ప్రజా ప్రభుత్వం రావాలి అంటే పవన్ రావాలి పాలనా మారాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారని జనసేన జానీ చెప్పడం జరిగింది.