రాజోలు నియోజకవర్గంలో వారాహి విజయ యాత్రకు సర్వం సిద్దం

  • మలికిపురం మండల జనసేన పార్టీ సమావేశం

రాజోలు నియోజకవర్గం: వారాహి విజయ యాత్రలో భాగంగా రాజోలు నియోజకవర్గానికి జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ కి ఘనస్వాగతం పలికే విధంగా అన్ని ఏర్పాట్లు సిద్ధమని ప్రజలకు తెలియజెయ్యడానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ సమక్షంలో పత్రికా సమావేశం ఏర్పాటు చెయ్యటం జరిగింది. వారితో పాటు ఈ పత్రికా సమావేశంలో రాజోలు నియోజకవర్గ వారాహి విజయ యాత్ర పరిశీలకులు రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్, జనసేన పార్టీ పీఏసీ మెంబెర్ & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, రాజోలు నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు.