డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం 9వ వారం

పిఠాపురం నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో, జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి, జ్యోతుల శ్రీనివాస్ జనసేన నాయకులు పిఠాపురం నియోజకవర్గము వారు ఏర్పాటుచేసిన శ్రీమతి డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం నందు గత 8 వారాలుగా ప్రతి శనివారం రైతులకు అన్నసదుపాయమును కల్పించుచున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా
9వ వారమైన ఈ శనివారం పిఠాపురం పశువుల సంత వద్ద రైతులకు, పశువుల బేరాల మధ్యవర్తులకు, వివిధ హాస్పటల్ కి వచ్చి ఔట్ పేషెంట్లకు కలిపి 450 మందికి అన్న సదుపాయమును కల్పించారు. శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నసదుపాయ కేంద్రం నందు పిఠాపురం నగర జనసేన నాయకులు అల్లం కిషోర్, ముత్యాల లోవరాజు, నక్కా మణికంఠ, బొచ్చ శ్రీకాంత్, రాయవరపు లోవరాజు, స్వచ్ఛగొల్లప్రోలు, అల్లం శ్రీను, రెడ్డి మనోహర్, అల్లం శ్రీనివాసు, జ్యోతుల నాని, ఇప్పర్తి శీను తదితరులు తమ సేవలను అందించారు. వీరిని చరవాణి ద్వారా జ్యోతుల శ్రీనివాసు ప్రశంస్తూ.. శ్రీమతి డోక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమునకు అనేకమంది ఈ విధంగా తమ సేవలందిస్తున్నారని వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయుచున్నానని జ్యోతుల శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.