బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జనసేన నేత
- మలిశెట్టి వెంకటరమణ సహకారంతో రూ.5000 ఆర్థిక సాయం
- ఆర్థిక సాయం అందించిన జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రామయ్య
రాజంపేట: సిద్ధవటం మండల పరిధిలోని మలినేని పట్నం గ్రామానికి చెందిన ఓబిలి సలీం (40) ఇటీవల కరెంట్ షాక్కు గురయ్యాడు. మంచానికే పరిమితమైన సలీం కుటుంబానికి రాజంపేట అసెంబ్లీ జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ సహకారంతో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, 5000 వేల రూ.ల ఆర్థిక సాయం చేశారు. సలీం కుటుంబాన్ని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-24-at-6.53.27-PM-1-1024x768.jpeg)