ఘనంగా పితాని పుట్టినరోజు వేడుకలు

ముమ్మిడివరం నియోజకవర్గం: జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ముమ్మిడివరం పార్టీ ఆఫీసులో వివిధ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మధ్య కోలాహాలంగా నిర్వహించడం జరిగింది. వేడుకలలో భాగంగా ముందుగా కుటుంబ సభ్యులతో భట్నవెల్లి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి. అర్చక స్వాములచే వేద ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది. ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు గుద్దటి జమ్మి సానబోయిన మల్లికార్జునరావు, ద్వాదశి పుండరీష్, జక్కంశెట్టి పండు మరియు ముమ్మిడివరం మండల కన్వీనర్ గొల్ల కోటి వెంకన్న బాబు లు భారీ గజమాలతో బాలకృష్ణ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినారు. తదుపరి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మండల ప్రాదేశిక సభ్యులు, గ్రామపంచాయతీ సర్పంచుల మధ్య భారీ కేక్ కట్ చేసిన బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రను ముమ్మిడివరంలో జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న వీరమహిళలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అభినందనలు తెలియజేసినారు. అలాగే జగన్ ప్రభుత్వ పాలనతో విసిగిపోయిన ప్రజలందరూ జనసేన పార్టీని ఎల్లప్పుడూ ప్రజల కోసం, దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ప్రతి కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల అవసరాలను తెలుసుకుంటూ, వారి పక్షాన నిలవాలన్నారు. నియోజకవర్గంలో ప్రతీ కార్యకర్తకి నేను అందుబాటులో ఉంటూ ప్రతి గ్రామాన్ని సందర్శిస్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో ఐ పోలవరం మండల అధ్యక్షులు మద్ధింశెట్టి పురుషోత్తం, ముమ్మిడివరం టౌన్ అధ్యక్షులు కడలి వెంకటేశ్వరరావు, కొండ కాట్రేనికోన మండల అధ్యక్షులు అత్తిలి బాబూరావు, బొంతు కనకారావు, సానబోయిన వీరభద్ర రావు, దూడల స్వామి, విత్తనాల అర్జునరావు, పెమ్మాడి గంగాద్రి, చిట్టూరి దొరబాబు, ఎలమంచిలి బాలరాజు, పెన్నాడ శివ, నాగరాజు, నూకల దుర్గ, సంగానీ ధర్మారావు, కర్రాదుర్గా ప్రసాద్, పితాని రాజు, బొక్క బాలరాజు, గిడ్డి రత్నశ్రీ, ఓవూరి భాగ్యశ్రీ, పిల్ల అనూష, గొలకోటి సాయిబాబు, బొంతు వీరబాబు, రంభాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.