పాతవెలుగుబంద గ్రామంలో జోరుగా సాగిన జనంకోసం జనసేన పాదయాత్ర
రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, పాతవెలుగుబంద గ్రామంలో జనంకోసం జనసేన పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా పాతవెలుగుబంద గ్రామంలో పర్యటించిన జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ప్రతీ ఇంటికీ తిరుగుతూ, ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ జనసేన పార్టీ మాత్రమే మనందరి జీవితాల్లో వెలుగులు నింపుతుందని, రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తూ జనసేన పార్టీ కరపత్రం, కీచైన్, పోకెట్ బ్యాడ్జ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-25-at-12.05.04-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-25-at-12.05.03-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-25-at-12.05.01-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-25-at-12.05.00-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-25-at-12.05.01-PM-2-1024x768.jpeg)