దొంగ ఓట్లను నిలువరించండి
- అర్హత కలిగిన ఓటర్లకు న్యాయం చెయ్యండి
- ఆర్డీవోను కోరిన జనసేన నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు
నెల్లూరు: ఓటర్ల నమోదు కార్యక్రమంలో దొంగ ఓట్లను నిలువరించాలని, అర్హత కలిగిన ఓటర్లకు న్యాయం చేయాలని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు పేర్కొన్నారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో నెల్లూరు ఆర్డీవో మాలోలను ఆయన జన సైనికులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడుతూ .. రాష్ట్రంలో ఓటరు నమోదు కార్యక్రమం ఆన్లైన్ ద్వారా చేయడం జరుగుతుందన్నారు. ఈ విధానం వల్ల కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయని అన్నారు. అర్హత కలిగిన ఓటర్ల నమోదుతో పాటు దొంగ ఓట్లు కూడా అత్యధికంగా నమోదు అవుతున్నాయని అన్నారు. నెల్లూరు నగరంలో కొన్ని డోర్ నంబర్లకు ఎక్కువ ఓట్లు నమోదు అవడం జరుగుతుందన్నారు. ఆన్లైన్ లో నమోదు అవుతున్న ఓట్లను తిరిగి పరిశీలించాలని కోరారు. పాత విధానంలో ఓట్లను పరిశీలించి నమోదైన దొంగ ఓట్లను తొలగించాలని కోరారు. అర్హత కలిగిన ఓటర్లకు ఓటు నమోదు సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కరీం, అలేక్, మాధవ్, వెంకటేశ్వర్లు, బాలాజీ, సాయి, ప్రవీణ్, జన సైనికులు, తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-26-at-1.17.57-PM-1024x683.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-26-at-1.18.00-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-26-at-1.18.01-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-26-at-1.18.10-PM.jpeg)