పలు కుటుంబాలను పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం కుమార పురం గ్రామానికి చెందినటువంటి తుమ్మలపల్లి సత్యనారాయణ (చిన్న) యాక్సిడెంట్ కారణంగా అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి మనో ధైర్యాన్ని అందించడం జరిగింది. తుమ్మలపల్లి మాణిక్యం గారి అకాల మరణానికి చింతిస్తూ వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని అందించిన జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్. ఈ కార్యక్రమంలో భాగంగా బావిశెట్టి రామకృష్ణ, గంధకొల్లు కృష్ణార్జున, వేతం వేణు, అడబాల స్వామి సురేష్, ముమ్మిడి నాగేంద్ర, కుసుమ గణేష్, తుమ్మలపల్లి రవి మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.