శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జనసేనలోకి భారీ చేరికలు

శేరిలింగంపల్లి నియోజకవర్గం: జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ జనసేన ఇంచార్జి డాక్టర్ మాధవ రెడ్డి ఆధ్వర్యంలో వివేకానంద్ నగర్ డివిజన్ నందు 100 మంది యువకులు మరియు మహిళలు చేరికలు జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధరం రాజలింగం మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా జనసేన కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. అలాగే డాక్టర్ మాధవరెడ్డి మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో జనసేన తన సత్తా చూపేందుకు సిద్దంగా ఉందని, ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ ఎల్లపుడూ ప్రజల పక్షాన నిలబడే జనసేన పార్టీలో యువకులు ఆకర్షితులై పార్టీ సభ్యత్వం తీసుకోవటం హర్షణీయమ్నారు. ప్రవీణ్ సాహో ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం, శేర్లింగంపల్లి ఇంఛార్జి మాధవరెడ్డి, అరుణ్ కుమార్, కళ్యాణ్ చక్రవర్తి, ప్రవీణ్ సహూ, సందీప్, మహేష్, జి.ఎస్.కే శ్రావణ్, వీరమహిళలు జ్యోతి, కల్యాణి మరియు ఇతర జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.