బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

  • ఆర్ధిక సహాయం అందించిన జనసేన మండల అధ్యక్షులు గోవింద రెడ్డి

ఎచ్చెర్ల నియోజకవర్గం: రణస్థలం మండలం, అల్లివలస గ్రామస్తులైన గుంటు జాని యర్రమ్మ దంపతుల కుమారుడు గుంటు కార్తిక్ చాలా రోజులు నుండి అనారోగ్యంతో బాదపడుతున్నాడు. విషయం తెలుసుకున్న జనసేన మండల అధ్యక్షులు గోవింద రెడ్డి బుధవారం కార్తిక్ వైద్య ఖర్చుల నిమిత్తం 20000/-రూపాయలు ఆర్ధిక సహాయం బాధిత కుటుంబానికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్ధానిక జనసేన పార్టీ కార్యకర్తలు సూరాడ యర్రయ్య, గుణ, ధనలక్షణ, కళ్యాణ్, నారాయుడు, అశోక్, సాయి, కాముడు, ప్రసాద్, జానీ, తదితరులు పాల్గొన్నారు.