పంట కాలువలో పూడిక తీయించండి

  • జనసేన నగర అధ్యక్షుడు సుజయ్ బాబు

నెల్లూరు: నెల్లూరు నగరంలోని చాముండి వారి తోట, నెల్లూరు చెరువుకు పక్కనే ఉన్న పంట కాలువలో పూడిక తీయించాలని జనసేన నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు అన్నారు. మంగళవారం చాముండి వారి తోటలో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని తెలుసుకుని ఆయన జనసైనికులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులో నుంచి నీళ్లు విడుదల చేయకపోవడంతో పంట కాలువ పూర్తిగా చెత్తతో నిండిపోయిందన్నారు. ప్రభుత్వం చెత్త పన్ను, ఇంటి పన్ను కట్టించుకుంటుందే తప్ప అధ్వానంగా ఉన్న పారిశుధ్య సమస్యను పరిష్కరించలేక పోతున్నారన్నారు. నగర ఎమ్మెల్యే అనిల్ జిల్లా కార్యాలయంలో కూర్చుని ప్రగల్బాలు పలుకుతున్నారని, తెలుగుదేశం పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. వారిని తిట్టడంలో చూపే శ్రద్ధ కనీసం 10 శాతం పారిశుధ్యం వైపు దృష్టి పెట్టాలన్నారు. మునిసిపల్ కమిషనర్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్తామన్నారు. ఈ చెత్త సమస్యను పరిష్కరించకపోతే జనసేన పార్టీ తరుపున వీటిని పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు వెంకటేష్, ఉదయ్, సాయి, వెంకటేశ్వర్లు, ప్రవీణ్, కిషోర్, సుధా తదితరులు పాల్గొన్నారు.