స్మార్ట్ ఏటిమొగ సాధిద్దాం.. పోస్టర్ ఆవిష్కరణ

కాకినాడ సిటి: జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక జగన్నధపురంలోని ఏటిమొగలో.. స్మార్ట్ ఏటిమొగ సాధిద్దాం అన్న పోస్టర్ని జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ ఇటీవల వారాహియాత్ర కాకినాడ సిటిలో జరిగిన సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఏటిమొగలో పర్యటించి స్థానిక మత్స్యకార ప్రజల స్థితిగతులు అవలోకించి, వారి జీవన విధానాలు, స్థానిక పరిస్థితులను గ్రహించి రేపటి తరమైన స్థానిక మత్స్యకారుల బిడ్డలు మంచి సుబ్రమైన వాతావరణం, పరిసరాలలో పెరగాలని కాబట్టి స్మార్ట్ సిటి కాకినాడలోని ఏటిమొగని “స్మార్ట్ ఏటిమొగ” గా తమ పార్టీ తయారుచేస్తామని పిలుపునిచ్చారని ముత్తా శశిధర్ గుర్తుచేస్తూ ఇందుకు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏటిమొగలో స్మార్ట్ ఏటిమొగని సాధిద్దాం, జనసేనని బలపరుద్దాం అన్న నినాదాన్ని విస్త్రుతంగా మత్స్యకారులకు అవగాహన కలిగించేలా చేస్తూ ఇంటి ఇంటికీ స్మార్ట్ ఏటిమొగ సాధిద్దాం అనే స్టిక్కర్లను అందచేసి, వాటిని ఇంటికి అతికించేలా మత్స్యకారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ముత్తా శశిధర్ మాట్లాడుతూ ఒక వ్యక్తి మనసులో ఉద్భవించిన ఆలోచన ఆవ్యక్తి యొక్క సంకల్పానికి అద్దం పడుతుందనీ అది వారి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమని అదే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వమన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏటిమొగలో జనసేన పార్టీ శ్రేణులు విస్త్రుతంగా నిర్వహించారు.