ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చివరి చూపు చూడ్డానికి వచ్చారు: బాబు పాలూరు
కురుపాం నియోజకవర్గంలో సీఎం జగన్ అమ్మఒడి సభ గురుంచి జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు మాట్లాడుతూ 3 ముక్కల్లో చెప్పాలంటే జనసమీకరణ కోసం ప్రతీ ఊరికి వేశారు ఒక బస్సు… భయపెట్టి బయలుదేరించినా, వచ్చిన జనం వెరీ లెస్సు… కాబట్టి జగనన్న మీటింగ్ మొత్తం తుస్సు… అంటూ ఎద్దేవా చేసారు. సభకు జనాదరణ లేకపోవడంతో ఆక్కసుతో, సభలో స్కూల్ పిల్లలు ఉన్నారన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మతిభ్రమించిన కోతిలా జగన్ రెడ్డి పెళ్లిళ్లు, పెళ్ళాల గురించి మాట్లాడుతున్నారు. మా అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ విధానాలు, వైసిపి ప్రజా వ్యతిరేక చర్యలు గురించి ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం లేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. సభకు వచ్చిన కొద్దిపాటి జనం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చివరి చూపు చూడ్డానికి వచ్చారు తప్ప జగన్ మీద అభిమానంతో కాదు. కురుపాం బస్టాండ్ ఎలా అయితే ఎవరికి ఉపయోగం లేకుండా ఉందో, రానున్న ఎన్నికలలో వైసిపి పార్టీ కూడా ఎందుకూ పనికిరాకుండా పోతుంది. పవన్ కళ్యాణ్ కి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి జగన్ రెడ్డి ఓ సైకోలా ప్రవర్తించడం ఆపకపోతే, ప్రజలే చీపుర్లు తిరగేసి మరీ జగన్ని వైసిపి పార్టీని తన్ని తరిమేస్తారని జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు, పార్వతీపురం నియోజకవర్గం నాయకులు అక్కివరపు మోహన్ రావు, గుమ లక్ష్మిపురం మండల అధ్యక్షులు కడ్రక మల్లేశ్వరరావు, కురుపాం నియోజకవర్గ నేరేడుమిల్లి వంశీ, గారా గౌరీ శంకర్, ఉపేంద్ర, పెంట శంకర్రావు, శ్రీరామ్, క్రాంతి, బొబ్బిలి, మండల అధ్యక్షులు సంచన గంగాధర్, బంకూరు పోలి నాయుడు, కొమరాడ మండల అధ్యక్షులు తెంటు శ్రీకర్, చిన్నారావు, శశి, కిరణ్, ప్రేమ్ తదితర జనసైనికులు హెచ్చరించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/babu-2-1024x584.png)