పవన్ కళ్యాణ్ ను విమర్శించే ముందు మీ కుటుంబ చరిత్రను ఒక్కసారి గుర్తుచేసుకోండి

  • జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం నియోజకవర్గం: జనసేన పార్టీ నాయకుడు పితాని బాలకృష్ణ ముమ్మిడివరంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ మీడియా సమావేశంలో పితాని బాలకృష్ణ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. అమ్మవడి పధకం డబ్బులు బటన్ నొల్కే కార్యక్రమంలో బుధవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వాఖ్యలు అత్యంత దుర్మార్గం. చిన్నపిల్లలు, తల్లిదండ్రులు ముందు మాట్లాడవలసిన మాటలేనా ఇవి అంటూ అసహ్యం వ్యక్తం చేసారు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ ను అనే ముందు మీ కుటుంబ చరిత్రను ఒక్కసారి గుర్తుచేసుకోండి. మీ తాతలు, మీ బాబాయ్, మీ చెల్లాయ్ పెళ్లిళ్ల గురించి మేము ప్రశ్నిస్తే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు. మీరు ప్రతీ మీటింగ్ లో దత్త పుత్రుడు అంటూ సంభోదిస్తున్నారు, మీ నోట్లో అశుద్దం పెట్టేవరకూ ఇలా మాట్లాడటం మానుకోరా? అంటూ పితాని ప్రశ్నించారు.. మమ్మల్ని విమర్శించడం మాని పరిపాలన సక్రమంగా జరిగేలా చూడండి, రాష్టానికి కంపెనీలు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నించండి. రాష్ట్రంలో ఇటువంటి దుర్మార్గపు పాలనను, దుర్మార్గపు ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదు. వారాహి యాత్రకు వచ్చిన అపూర్వ స్పందన చూసి మీకు వెన్నులో వణుకు పుడుతోంది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం తద్యం అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై పితాని ఫైర్ అయ్యారు.