పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల దంపతులు

రాజానగరం మండలం రాజానగరం శ్రీరాంనగర్ కాలనీకి చెందిన అల్లు రఘు ఇటీవల యాక్సిడెంట్లో మరణించడంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. చేతికి అందొచ్చిన కొడుకు ఇక లేడనే ఆ తల్లి ఆవేదన ఎవరు తీర్చలేనిది వారి కుటుంబాన్ని పరామర్శించి మనోదైర్యం చెప్పి భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేసారు. రాజానగరం మండలం రాజానగరం శ్రీరాంనగర్ కాలనీకి చెందిన రాకోటి నాగ శివ సాయి ఇటీవల యాక్సిడెంట్లో తీవ్ర గాయాలపాలై ఇంటి వద్ద వైద్యం చేయించుకుంటున్నారని తెలిసి వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని ఎప్పుడు ఏ అవసరం వచ్చినా జనసేన పార్టీ ఎల్లప్పుడూ తోడుగా అండగా ఉంటుందనే భరోసా కలిపించారు. రాజానగరం మండలం సూర్యాపేట గ్రామానికి చెందిన కోసూరి భారతి అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని ఎప్పుడు ఏ అవసరం వచ్చినా జనసేన పార్టీ ఎల్లప్పుడూ తోడుగా అండగా ఉంటుందనే భరోసా కలిపించారు. వీరి వెంట జనసేన పార్టీ నాయకులు కుర్రే నాగబాబు, మోది సత్తిబాబు, పిడుగు సురేష్, నాతిపం దొరబాబు, గొంతెన సూరిబాబు, బీసీ నాయకులు వీరబాబు, గల్లా రంగా, కురుమల్ల మహేష్, షేక్ అస్లాం, వీరమహిళ గండి జయసుధ మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.