జోగుంపేట జనసైనికులకు అండగా సీతానగరం జనసేన ఆర్థికసాయం

రాజానగరం నియోజకవర్గం: సీతానగరం మండలం, జోగుంపేట గ్రామానికి చెందిన జనసైనికుడు ఉద్దవోలు ప్రకాష్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు, జనసైనికులు వెళ్లి పరామర్శించి ఆర్థిక సాయం చేయటం జరిగింది. మీకు అండగా మేము ఉన్నాము అనే భరోసాను ఇవ్వటం జరిగింది. అదే విదంగా అదే గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు యాక్సిడెంట్ లో గాయ పడిన విషయం తెలుసుకొని వారికి కూడా పార్టీ తరుపున ఆర్థిక సాయం చేసి భరోసాను కలిపించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ పైల సత్యన్నారాయణ, నియోజకవర్గ నాయకులు అక్కివరపు మోహన్ రావు, అల్లు రమేష్, మురళి, సంతోష్, సత్యన్నారాయణ, రఘు, నరేష్, ధనుంజయ్, చిరంజీవి మరియు జనసైనికులు తేజ, రమేష్, ధనుంజయ్ మరియు గ్రామ జనసైనికులు, యువత పాల్గొన్నారు.