ఎస్. ఆర్ నగర్ డివిజన్ లో జనంలోకి జనసేన

సనత్ నగర్ నియోజకవర్గం: సనత్ నగర్ లోని ఎస్. ఆర్ నగర్ డివిజన్ లో సనత్ నగర్ నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ శ్రీమతి ఎమ్. కావ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆదివారం జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరమహిళలు వెంకటలక్ష్మి, భవాని, పద్మజ, జనసైనికులు హనుమంత్ నాయక్, లోకేష్, రాజ్ కుమార్, అనిల్, నవీన్, బండి హనుమంత్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ శ్రీమతి ఎమ్. కావ్య ముదిరాజ్ జనసేన తరఫున ధన్యవాదములు తెలిపారు.