కిల్లో రాజన్, అశోక్ ఆధ్వర్యంలో జనసేన కరపత్రాల పంపిణీ

పాడేరు నియోజకవర్గం: గిరిజన ప్రజలపై వైసీపీ ప్రభుత్వ వైఖరి, వైసీపీ గిరిజన ప్రజాప్రతినిధుల అసమర్థత రాజకీయ విధానాలను తదితర అంశాలపై గిరిజన ప్రజలకు అవగాహన కల్పిస్తూ …శనివారం అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ డా. గంగులయ్య మరియు జనసేన పార్టీ శ్రేణుల ద్వారా విడుదల చేసిన కరపత్రాలను పిల్లిపుట్టు, గొండేలి, లంపేలి, చీడిమెట్టు గ్రామాల గిరిజన సోదరులకు జనసేన పార్టీ నియోజకవర్గ లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, నియోజకవర్గ ఐటి ఇన్చార్జ్ అశోక్ పంచి పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ ద్వారా మేము సందిస్తున్నా ప్రశ్నలకు బదులివ్వగలరా? వైసీపీ ప్రజాప్రతినిధులారా మీకు తెలియదులే!! మీకు తెలిసిందల్లా బానిసత్వం, ఊడిగం, ఊకదంపుడు సోది తప్ప అంటూ కిల్లో రాజన్, అశోక్ ఎద్దేవా చేశారు.