జనసైనికుడు రవికుమార్ కు అండగా నిలచిన జనసేన
ఇచ్చాపురం: సోంపేట మండలం, పి. శాసనం గ్రామానికి చెందిన జనసైనికుడు కుత్తుం రవికుమార్ ఇటీవల జరిగిన యాక్సిడెంట్లో తలకు, కాళ్లకు తీవ్ర గాయాల పాలై, చికిత్స పొందుతున్నారు. స్థానిక జనసైనికుల ద్వారా విషయం తెలుసుకున్న జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి జనసైనికులతో కలసి సోమవారం రవికుమార్ ను పరామర్శించి, పవన్ సేవా సంస్థ ద్వారా జనసైనికులు సమక్షంలో ఆర్థిక సాయం 3000/ రూపాయలను అందజేయడం జరిగింది. మంచి మనసుతో ఆర్థిక సాయం చేసినందుకు జనసైనికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ప్రధాన కార్యకర్తలు పెద్దింటి రవి, శివ, బచ్చల శంకర్, సాయి, గోపాల్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-03-at-5.56.32-PM-1024x461.jpeg)