ఘనంగా వంగవీటి జయంతి వేడుకలు
- జోహర్ వంగవీటి మోహనరంగా
నెల్లూరు: వంగవీటి మోహన రంగా 76వ జయంతి సందర్భంగా మంగళవారం కోవూరు మైధిలీ హాల్ సెంటర్ వద్ద కాపు నాయకుడు తన్మయ్ ఆధ్వర్యంలో వారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పాటు పలువురు కాపు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రంగన్న ఈ పేరు 1980 దశకంలో బడుగు బలహీన వర్గాల గుండె చప్పుడు, రౌడీ మూకలకు సింహస్వప్నం, ఆడపిల్లలకు ఒక అన్న లాంటి బరోసా. చనిపోయి 35 సవత్సరాలు దాటినా కూడా ప్రజల గుండెల్లో కొలువై, ప్రజల నుండి నీరాజనాలు అందుకుంటూ, పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసి మీరు ఉన్నత స్థానంలో ఉన్నారు వారి 76వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాం. నేటి నాయకులలో బడుగు బలహీన వర్గాలకు అండగా నిలగవగల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే. కులమతాలకతీతంగా అన్ని వర్గాలకు అధికారం ఉండేలాగా ప్రార్థిస్తున్న నాయకుడిని గెలిపించి, రంగా గారి ఆశయాలలో నడుస్తున్న వారిని ముందుకు నడిపించి అందరూ ఆదరించవలసిందిగా కోరారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-04-at-4.46.50-PM-2-1024x633.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-04-at-4.46.50-PM-3-1024x709.jpeg)