పలు కుటుంబాలను పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం నియోజకవర్గం: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ సోమవారం కాట్రేనికోన మండలంలోని పలు కుటుంబాలను పరామర్శించారు. ముందుగా కాట్రేనికోన గ్రామంలో ఇటీవల ప్రమాదానికి గురిఅయ్యి చికిత్స పొందుతున్న ఆశపు శ్రీను కుమారుడిని, అలాగే కాట్రేనికోన మండలం కుండలేశ్వరం గ్రామానికి చెందిన మోటుపల్లి లక్ష్మి స్వర్గస్తులయ్యారు వారి కుమారుడు మోటుపల్లి శ్రీను వారి కుటుంబ సభ్యులను, అదే విధంగా కందికుప్ప గ్రామానికి చెందిన నల్లం రామకృష్ణ ఇటీవల విద్యుత్ షాక్ తో మృతి చెందిగావారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ఈ కార్యక్రమంలో నూకల దుర్గబాబు, పిల్లి గోపి, విళ్ల శివ, బీమల సూర్య నాయుడు, గిడ్డి రత్నశ్రీ, సంసాని పాండురంగారావు గోలకోటి వెంకటేశ్వరరావు, గోలకోటి ఫణి మొదలగు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీరమహిళలు పాల్గొన్నారు.