చల్లపల్లిలో జనసైనికుల ఆత్మీయ సమావేశం
అవనిగడ్డ నియోజకవర్గం: చల్లపల్లిలో మోపిదేవి, చల్లపల్లి, ఘంటశాల మండలాల జనసైనికుల ఆత్మీయ సమావేశం సోమవారం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనసైనికుల యొక్క ఆలోచనలని ఆవేదనని స్వేచ్ఛగా తెలియజేయడం, పార్టీపై అధినేతపై వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని బలంగా వినిపించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యం తప్పితే వ్యక్తులు, గ్రూప్ లు వారి సొంత ఎజెండాలతో మాకు పనిలేదని పార్టీ కోసం మరింత కష్టపడతామని తెలియజేయడం జరిగింది. రాభోయే రోజుల్లో ఈ 3మండలాల్లో పార్టీ గ్రామ స్థాయిలో బలోపేతం చేయడానికి అవసరమైన విధంగా అందరం కృషి చేసి, వచ్చే ఎన్నికలలో అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించుకుని రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ అధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడమే అంతిమ లక్ష్యం అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ జనసైనికుల ఆత్మీయ సమావేశానికి విచ్చేసి పార్టీ బలోపేతం గురించి విలువైన సూచనలు, సలహాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే సమావేశానికి విచ్చేసి విజయవంతం చేయడంలో భాగం అయిన ప్రతి ఒక్క జనసైనికులకు, వీరమహిళలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియచేయడం జరిగినది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-10-at-6.13.59-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-10-at-6.13.58-PM.jpeg)