జనసేన జన జాగృతి యాత్ర 94వ రోజు
రాజానగరం: జనసేన జనజాగృతి యాత్ర 94వ రోజు కార్యక్రమంలొ భాగంగా పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం సోమవారం సీతానగరం మండలం, కూనవరం గ్రామంలో కార్యక్రమంలో భాగంగా 500 గాజు గ్లాసులు పంపిణి చెయ్యటం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 57,200 వేల గాజు గ్లాసులు పలు గ్రామాల్లో ఇవ్వటం జరిగింది. జనసేన జన జాగృతి యాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ &ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా సరూప దేవి అధ్యక్షతన దిగ్విజయంగా ముందుకు సాగుతూ రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ జండా ఎగరేసే విధంగా ముందుకు సాగిపోతుంది. గ్రామ గ్రామన ప్రతి ఇంటింకి వెళ్లి జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహం కరపత్రాలు ప్రజలకు అందిస్తూ… జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో సీతానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్, రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, కోరుకొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ వీరమహిళ కందికట్ల అరుణ కుమారి, చదువు ముక్తేశ్వరరావు, చదువు నాగేశ్వరరావు, తన్నీరు తాతాజీ, అడపా అంజి బాబు, కూనవరం జనసేన పార్టీ నాయకులు గేదల సత్తిబాబు, చిక్కాల నాగశ్రీను, శ్రీను, అయ్యప్ప, ఉమ్మిడి శెట్టి సురేష్, కాళ్ళ రాము, వీరమహిళలు మరియు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-10-at-18.26.38-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-10-at-18.26.38-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-10-at-6.19.53-PM-1024x580.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-10-at-6.19.52-PM-1024x580.jpeg)