పవన్ కళ్యాణ్‌పై అసభ్యకర పోస్టింగ్‌లపై చర్యలు తీసుకోవాలి

  • హైదరాబాద్ సైబర్ క్రైమ్ కమీషనర్ కు జనసేన శ్రేణుల ఫిర్యాదు

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై, వారి వ్యక్తిగత జీవితంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై సోమవారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ కార్యాలయంలో సైబర్ క్రైమ్ కమీషనర్ కు జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైద్రాబాద్ అధ్యక్షులు రాజలింగం, తెలంగాణా నాయకులు దామోదర్ రెడ్డి, వీరమహిళా ఛైర్మెన్ కావ్య ఫిర్యాదు చేసారు.
ఈ కార్యక్రమంలో పాల్గినా తెలంగాణా రాష్ట్ర నాయకులు, తెలంగాణా రాష్ట్ర వీరమహిళలు, గ్రేటర్ హైద్రాబాద్ నాయకులు, నియోజకవర్గ ఇంచార్జీలు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.