వాలంటీర్ వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడే వ్యక్తి కాదు

  • అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ

గుంతకల్ నియోజకవర్గం: వాలంటీర్ వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడే వ్యక్తి కాదని అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మణికంఠ విలేకరులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మాటలకు నిదర్శనంగా ఉదాహరణకు అనంతపురం జిల్లా, గుంతకల్ నియోజకవర్గం, గుత్తి పట్టణ కోట ప్రాంతంలో స్థల వివాదంలో పాత్రికేయ దంపతులపై ఒక వాలంటీర్ మార్చ్ 20 తారీకు నాడు తీవ్రంగా దాడి చేశాడు. దాడికి పాల్పడిన వాలంటీర్ పై ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ విచారణ జరపని పోలీస్, మున్సిపల్ అధికారులు. కారణమేమంటే అక్కడున్న బలమైన రాజకీయ నాయకులు అడ్డు తగులుతుండడమే. పాత్రికేయ మిత్రులకే భద్రత లేకుండా న్యాయం జరగకుండా ఉంటే ఇంక సామాన్యుల పరిస్థితి ఏంటి అని జనసేన పార్టీ తరపున ప్రశ్నిస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థ ప్రారంభమైన దగ్గర నుండి ఇప్పటివరకు ఒంటరి మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు టార్గెట్గా ఎన్నో అత్యాచారాలు, వేధింపు సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా బయటకు వచ్చాయి. వాలంటీర్లు అందరికీ ఆపాదించడం కాదు గాని కొంతమంది అయితే క్రిమినల్ మైండ్ తో ఉన్నారు. అలాంటి వాళ్లు హ్యూమన్ ట్రాకింగ్ చేయడానికి వెనకాడరు. సమాజంలో సేవ మార్గంలో ఉండవలసిన వాలంటీర్ మహిళలపై దాడులకు పాల్పడుతుంటే చర్యలకు అధికారులు మీన మేషాలు లెక్కించడం ఏంటి, తక్షణం పాత్రికేయ కుటుంబానికి న్యాయం చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన పాత్రికేయ కుటుంబానికి అండగా జనసేన పార్టీ పోరాటం చేస్తుందని వాసగిరి మణికంఠ హెచ్చరించారు.