నెల్లూరులో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం

నెల్లూరు నియోజకవర్గం: నెల్లూరు నగరంలో స్థానిక శ్రీహరి నగర్ లో ఉన్న జనసేన ప్రధాన కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి జనసేన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పాలాభిషేకం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలను దహనం చేయడాన్ని నిరసిస్తూ పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి అవసరమని జనసేన నేతలు కార్యకర్తలు ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనక్రాంత్ రెడ్డి, నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు మరియు వీరమహిళలు జనసేన నాయకులు పాల్గొన్నారు.