వాలంటీర్లు కొందరిని మాత్రమే ఉద్దేశించి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ల పై చేసిన వ్యాఖ్యలను పూర్తిగా విన్న తరువాత మాట్లాడాలని పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు.. సామర్లకోట లో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పలుచోట్ల కొంతమంది వాలంటీర్లు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని పలు చోట్ల స్థానిక పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు అయిన సంఘటనలు అనేకం ఉన్నాయని అన్నారు. సామర్లకోట ఒక ప్రాంతంలో వాలంటీర్ పలువురి వద్ద నుండి పెద్ద మొత్తంలో సొమ్ములు వసూలు చేసి పరారైన సంఘటన జరగలేదా అని ప్రశ్నించారు. అలాగే రాష్ట్రంలో కొంత మంది వాలంటీర్లు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయని అటువంటి వారి గురించి మాట్లాడితే మీకు ఎందుకు భయం అని అన్నారు. సమావేశంలో జనసేన నాయకులు పిట్టా జానకి రామారావు, సుంకర కృష్ణవేణి, సరోజ వాసు, మంచెం సాయి బాబు, అత్తిలి కృష్ణ, పొలమరశెట్టి సత్తిబాబు, ఒబిలిశెట్టి గణేష్, పెంకే వెంకతలక్ష్మీ, మడగల శ్యామ్, తుమ్మల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.