ఇచ్చాపురంలో జనసేనాని చిత్రపటానికి పాలాభిషేకం

ఇచ్చాపురం నియోజకవర్గం: ఇచ్చాపురం మున్సిపాలిటీలో మంగళవారం వాలంటీర్లను వైసీపీ నాయకులు రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ బొమ్మను దగ్ధం చేశారు. దానికి నిరసనగా బుధవారం ఇచ్ఛాపురం జనసేన పార్టీ కార్యాలయం వద్ద నుండి జనసేన ఇంఛార్జి దాసరి రాజు ఆధ్వర్యంలో జనసైనికులు, వీరమహిళలు ర్యాలీగా బయలుదేరి నినాదాలు చేస్తూ వెళ్లి ఎక్కడైతే మంగళవారం పవన్ కళ్యాణ్ గారి బొమ్మ దహనం చేశారో ఆ ప్రదేశంలో పసుపు నీళ్లతో శుద్ది చేసి, పవన్ కళ్యాణ్ ఫోటోకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఇచ్ఛాపురం ఇంఛార్జి దాసరి రాజు మాట్లాడుతూ.. ఏదైతే ఉద్ధానం ప్రధాన సమస్య అయిన కిడ్నీ సమస్య కోసం 24 గంటలు నిరాహార దీక్ష చేసిన మహనీయుడిని అవమానించడం వైసీపీ నాయకుల దాష్టీకానికి పరాకాష్ట అని, ఎంతో మంది నాయకులు వచ్చి వెళ్లారు, ఈ నియోజక వర్గంలో ఎందరో నాయకులు ఉన్నారు కానీ ఇక్కడ సమస్య ఎవరికీ పట్టలేదు. అని ఉద్ధానం ఊపీరికోసం పోరాడిన నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా, ఇచ్ఛాపురం మండల అధ్యక్షురాలు శ్రీమతి దుర్గాసి నీలవేణి రెడ్డి, కంచిలి మండల అధ్యక్షులు డొక్కరి ఈశ్వర్ రావు, ఇచ్ఛాపురం మున్సిపాలిటీ వార్డ్ ఇంఛార్జి లు రోకళ్ళ భాస్కర్, దాసరి శేఖర్, కలియ, డిల్లీ బిశాయి, వీరమహిళ శైలజ మరియు జనసైనికులు భారీగా పాల్గొన్నారు.