వైసిపి రాజకీయంగా వాడుకోవడానికే వాలంటరీ వ్యవస్థ

  • నోరు అదుపులో పెట్టుకో రోజా
  • వెధవలకు మధ్యవర్తిగా కొందరు పురుష వాలంటరీలు
  • జనసేన పార్టీ వీరమహిళల ఆగ్రహం

తిరుపతి: ప్రస్తుత పాలక వైసిపి పార్టీ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా మహిళలు వేధింపుల దిశగా ఆత్మహత్యలు, అత్యాచారాలకు గురి అవుతున్నారని, దీనిపై తమ జనసేనాని జరుగుతున్న నిజాల్ని మాట్లాడితే మా అధినేతపై వైకాపా మంత్రులు బరితెగించి టార్గెట్ చేసి మాట్లాడడాన్ని ఖండిస్తూ, జనసేన పార్టీ వీరమహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.. స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ.. ప్రజలకు మేలు జరుగుతుందని వాలంటరీలకు వారి సమాచారం అందించడం వలన మహిళలు (వితంతువులు, పెళ్లి కాని అమ్మాయిలు) వీరి డేటా ఫోన్ నెంబర్ అన్ని దుర్మార్గులకు చేరి మహిళలకే ముప్పు వాటిల్లుతున్నదన్నారు. ఇది వైకాపా దుర్మార్గపు పాలనలో జరిగిన నిజాల వార్తలను తిరగేస్తే తెలుస్తుందన్నారు. ఇలా అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే కొందరు పురుష వాలంటరీల వలన మహిళలకు ముప్పు ఉన్నదని, అది కొందరు చెడ్డ వాలంటరీల వల్లే జరిగిందని నిజాలు మాట్లాడిన మా పవన్ కళ్యాణ్ పై వైయస్సార్సీపి శునకాలు సీఎం జగన్ మెప్పుకోసం రెచ్చిపోవడం తగదని హెచ్చరించారు. మా అవ్వ మంత్రి రోజా వాలంటరీలు కరోనాలో దేవుళ్ళలా పనిచేశారని పొగడ్తల వర్షం కురిపించడం మంచిదన్నారు. అలాంటప్పుడు రోజా ఆమె వారసుల్ని వాలంటరీలుగా చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. అది కానిపక్షంలో వాలంటరీలకిచ్చి పెళ్లి చేయొచ్చు కదా అని చురకలు విసిరారు. వాలంటరీలు వైసీపీ నాయకులకు వేగులుగా పనిచేసే కూలి వాళ్ళా అంటూ వైసీపీ మంత్రులను ప్రశ్నించారు. జగన్ జగనాటకం లో వాలంటరీలను భానిసలులా వాడుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి తమ జనసేనానిపై ఆరోపణలు చేసి నా, తక్కువ చేసి మాట్లాడినా ఇంటికొచ్చి పోరకలతో కొడతామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నేతలు ఆకేపాటి సుభాషిని, రాయల సీమ రిజనల్ కోడినేటర్ ఆకుల వనజ, దుర్గ, చందన తదితరులు పాల్గొన్నారు.