పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పని చేద్దాం
- జనసేన నాయకులు రామాంజనేయులును
మదనపల్లె నియోజకవర్గం: మదనపల్లె జనసేన నాయకులు రామాంజనేయులు ను గురువారం జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా సంయుక్త కార్యదర్శి సనావుల్లా, రామ సముద్రం మండలం అధ్యక్షులు చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు గడ్డం లక్ష్మీపతి, సంయుక్త కార్యదర్శి క్రాంతి కుమార్, వంశి మరియు గౌతమ్ మర్యాదపూర్వకంగా కలిసి సాలువ, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జనసేన క్యాడర్ రామ సముద్రం మండలంలో చాలా బలంగా వుంది అని, పవన్ కళ్యాణ్ గారి ఆశయసాదనం కోసం బలంగా పనిచేస్తున్నామని చెప్పారు. మదనపల్లెలో రాబోయే ఎన్నికల్లో జనసేన జెండా ఎగరవేసే దిశగా మన అధ్యక్షులు వారిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా అందరూ కలిసి పని చేద్దాం అని రామాంజనేయులు తెలిపారు. వీరితో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, దారం హరిప్రసాద్, హరిహరన్ ఉన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-13-at-1.07.45-PM-1024x416.jpeg)