వైద్య మరియు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన గాదె

గుంటూరు: శ్రీ విజేత హై స్కూల్ & శ్రీ విజేత స్పెషాలిటీ క్లినిక్ చెరుకూరి శ్రీ హరి, మధులాల్ ఆధ్వర్యంలో మెగా వైద్య మరియు రక్తదాన శిబిరాన్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ.. ఏ.టి అగ్రహారంలో “శ్రీ విజేత స్పెషాలిటీ క్లినిక్” వారు ఏర్పాటుచేసిన ఉచిత బీపీ, షుగర్, థైరాడ్ టెస్ట్ లు, ఉచిత మందుల పంపిణీ మరియు శ్రీ విజేత హై స్కూల్ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయం. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశించారు. ఈ విధమైన కార్యక్రమ ఏర్పాటు చేసిన మా సోదరుడు శ్రీ మధు లాల్ ని అభినందిస్తున్నాను. భవిషత్ లో ప్రజలకు సేవ చేసే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చెయ్యాలని అలా చేసే కార్యక్రమాల్లో మా జనసేన పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయుబ్ కమాల్, అడపా మాణిక్యాలరావు, శిఖా బాలు, శ్రీపతి భూషయ్య, దాసరి వెంకటేశ్వరరావు, కురపాటి నాగేశ్వరరావు, పశువులేటి నరసింహారావు, కిషోర్, రాజ్యలక్ష్మి గంగరాజు, సలామ్, హుస్సేన్, రాజా, రఘు తదితరులు పాల్గొన్నారు.