కోసిగి మండలంలో జనసేన నిరసన ర్యాలీ
మంత్రాలయం నియోజకవర్గం: కోసిగి మండల పరిధిలోని శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి దగ్గర నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు మంత్రాలయం తాలూకా జనసేన నాయకులు పొంత నరసింహులు ఆధ్వర్యంలో ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వైసిపి నాయకులు వాలంటీర్స్ పవన్ కళ్యాణ్ వాలంటీర్స్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దహనం చేసినందుకుగాను దీనిని ఖండిస్తూ.. జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ర్యాలీ నిర్వహించి, పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కౌతాళం, కోసిగి, పెద్దకడబూరు, మంత్రాలయం నాలుగు మండలాల నాయకులు, అభిమానులు పాల్గొనడం జరిగింది. జనసేన మండల నాయకులు రమేష్ గౌడ్, చింతలగేని వీరారెడ్డి, రచ్చమారి ఏసేబు, చింతలగేని నాగేష్, కరణి రవి, చిర్తనగల్ రమేష్, నాగరాజ్ జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-16-at-9.03.01-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-16-at-9.03.02-PM-1024x461.jpeg)