గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెకు జనసేన మద్దతు

కొత్తగూడెం నియోజకవర్గం: లక్ష్మీదేవి పల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు భద్రాద్రి కొత్తగూడెం జనసేన పార్టీ తరఫున సోమవారం మద్ధతు తెలపడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వేముల కార్తీక్, కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ ఎండి. సాదిక్ పాషా, చుంచుపల్లి మండల అధ్యక్షుడు బర్మావత్ హతిరాం, సుజాతనగర్ మండల అధ్యక్షుడు అల్వాల కార్తీక్, కొత్తగూడెం టౌన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయి అనిత్, పాల్వంచ మండల వైస్ ప్రెసిడెంట్ సంపత్, కొత్తగూడెం సెక్రెటరీ ముజాఫర్, సూజాతనగర్ జనరల్ సెక్రెటరీ కిషోర్, సుజాతనగర్ ప్రెసిడెంట్ రాకేష్ మరియు జనసేన కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పంచాయితీ కార్మికులకు జనసేన పార్టీ తరుపున పవన్ కళ్యాణ్ వారికి ధన్యవాదములు తెలిపారు.