పలు కుటుంబాలను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం నియోజకవర్గం: జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ బుధవారం ఇటీవల యాక్సిడెంట్ కు గురైన తాళ్లరేవు మండలం, గ్రాంటు గ్రామానికి చెందిన పిల్లి వీరనాగు, వారి సతీమణిని పలకరించారు. అనంతరం ఇటీవల స్వర్గస్తులైన తాళ్లరేవు గ్రామానికి చెందిన గంజా లక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తాళ్లరేవు గ్రామ అధ్యక్షులు అత్తిలి బాబురావు, ఎం. సత్య మణికంఠ, చిక్కం సత్తిబాబు, కుడిపూడి కృష్ణ, పంపన లక్ష్మణ రావు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.