శెట్టిబలిజ పెద్దలను కలసిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం నియోజకవర్గం: జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ తాళ్లరేవు మండలంలో కేశవపురం, మల్లవరం గ్రామాలలో బుధవారం శెట్టిబలిజ పెద్దలను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేశవపురం ముత్యాలమ్మ కమిటీ శెట్టిబలిజ గ్రామపెద్దలు వాసంశెట్టి శ్రీనివాసరావు, విత్తనాల రామకృష్ణ, బొంతు శ్రీను, వానచర్ల చంద్రరావు, గీసాల సత్తిబాబు అలాగే మల్లవరం గ్రామ శెట్టిబలిజ పెద్దలు కుడిపూడి కృష్ణ, చిట్టూరి నాగేశ్వరరావు, పంపన లక్ష్మణరావు మొదలగు వారు పాల్గొన్నారు. అలాగే మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, కుడిపూడి కృష్ణ, చిట్టూరి నాగేశ్వరరావు, పంపన లక్ష్మణరావు పాల్గొన్నారు.