స్వర్గీయ పాఠంశెట్టి నారాయణరావుకు ఘన నివాళులు
జగ్గంపేట నియోజకవర్గం: జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర తండ్రి స్వర్గీయ పాఠంశెట్టి నారాయణరావు గత కొన్ని రోజుల క్రితం మరణించారని వార్త తెలుసుకున్న జనసేన నాయకులు పికే రంగారావు, కొప్పాక విజయ్ కుమార్, పెరుగు శివ, బొల్లా గోవిందు తదితరులు గురువారం పాఠంశెట్టి నారాయణరావు చిత్రపటానికి పూలమాలలతో శ్రద్ధాంజలి ఘటించి, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని, మనోధైర్యాన్ని తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-20-at-3.56.24-PM-1024x768.jpeg)