పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని చండీయాగం నిర్వహించిన రాయపురెడ్డి

మాడుగుల నియోజకవర్గం: మాడుగుల మండలంలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని మాడుగుల నియోజకవర్గ నాయకులు మరియు మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాయపురెడ్డి కృష్ణ గురువారం చండీయాగం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు ఎలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జ్ సుందరపు విజయకుమార్ విచ్చేసి యాగంలో పాల్గొన్నారు. వేద పండితులు మంత్రోపసానాలతో నాలుగు మండలాల్లో ఉన్న ముఖ్య నాయకులు సమక్షంలో ఈ అతి భారీ చండీయాగం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత ముఖ్యమంత్రి కావాలని మాడుగుల నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరాలని ఈ యొక్క ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు రాయపురెడ్డి కృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.