ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న కనపర్తి మనోజ్ కుమార్

  • పొన్నలూరులో కచ్చేరి బజార్ కి సిమెంట్ రోడ్డు, డ్రైనేజీలు నిర్మించరా..?
  • వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి లేదు, జరగదు అంటున్న గ్రామ ప్రజలు

కొండపి నియోజకవర్గం: పొన్నలూరు మండలంలో జనసేన మండల నాయకులు ఆదివారం పర్యటించి, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా పొన్నలూరు మండలంలో ప్రధాన కూడలి అయిన కచ్చేరి బజార్ కి సిమెంట్ రోడ్డు మరియు డ్రైనేజీలు లేకపోవడం ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అధికారంలో ఉన్న మండల ముఖ్య నాయకుల ఇళ్ల పరిధిలో కూడా సిమెంటు రోడ్డు లేకపోవడం వలన, మండలంలో ఉన్నటువంటి పల్లెటూర్లకు సిసి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థలు ఎప్పటికీ నిర్మించలేరు. అభివృద్ధి చేయలేరు అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. మండలాన్ని అభివృద్ధి చేయలేని వారు మండల పరిధిలో ఉన్న పల్లెటూర్లను ఎలా అభివృద్ధి చేస్తారు..? అని వైసిపి నాయకులను జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు. అతి తొందరలో కచ్చేరి బజారుకి సిమెంటు రోడ్డు మరియు డ్రైనేజీ ని నిర్మించాలి అని జనసేన పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తూ, అధికారులకు వినతిపత్రం కూడా ఇస్తాము అని పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దొరడ్ల సుబ్రహ్మణ్యం నాయుడు, కర్ణ తిరుమలరెడ్డి, ఖాదర్ బాషా, గడిపూడి భార్గవ్, సుంకేశ్వరం శ్రీను, సుంకేశ్వరం సాయి, నూకల లక్ష్మణ్ మొదలైన వాళ్ళు పాల్గొన్నారు.