మల్లంపూడిలో పలు కుటుంబాలని పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, మల్లంపూడి గ్రామంలో సోమవారం పలు కుటుంబాలని జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పలకరించి, పరామర్శించారు. ముందుగా మల్లంపూడి గ్రామానికి చెందిన పప్పు భీమరాజు ఇటీవల బైక్ యాక్సిడెంట్ లో గాయాలపాలయ్యారని తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని, వైద్యుల సూచనల మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేసారు. అనంతరం అదే గ్రామానికి చెందిన సంగుల బాబులు అనారోగ్యంతో బాధపడ్తున్నారని తెలుసుకుని వారిని పలకరించి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని వైద్యుల సూచనల మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేసారు. వీరి వెంట సంగుల తమ్మరావు, సంగుల రమేష్ బాబు, సంగుల దుర్గాప్రసాద్, మేక ప్రదీప్, జి. సతీష్, ఏ. సతీష్, సంగుల చిట్టిదొర, సంగుల సతీష్, కె. మణికంఠ స్వామి, సంగుల గంగబాబు, ఆకుల శ్రీనివాస్, పడాల శ్రీను, పడాల వీరబాబు, ఒక్కపట్ల వీరబాబు, సంగుల శ్రీను, సంగుల నాగేశ్వరావు, సంగుల సుబ్రహ్మణ్యం, పప్పు దుర్గాప్రసాద్, గుబ్బల వీర వెంకట స్వామి, మదిరెడ్డి బాబులు, వేగిశెట్టి రాజు, దేనిడి మణికంఠ స్వామి (డి ఎం ఎస్), జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.