కాకినాడ జనసేనలో చేరిన మత్స్యకార యువత
కాకినాడ రూరల్: కాకినాడ గొడరిగుంటలో మంగళవారం జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సమక్షంలో తూరంగి జనసేన నాయకులు శాండీ, ఉప్పలంక గ్రామ అధ్యక్షులు సంఘాడి శ్రీను ఆధ్వర్యంలో మత్స్యకార నాయకులు వెంకటరావు, కృష్ణ నాయకత్వంలో కరప మండలం, ఉప్పలంక గ్రామం, మొండి ప్రాంతానికి చెందిన మత్స్యకార యువత సుమారు 30 మంది జనసేన పార్టీలో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయకత్వం, సిద్ధాంతాలు నచ్చి, సమస్యలపై స్పందించే విధానాలకి ఆకర్షితులై పెద్దలు జనసేన పార్టీ లో చేరుతున్నారని పంతం నానాజీ తెలిపారు.. ఈ కార్యక్రమంలో సోదే ముసలయ్య, తూము బన్ను, తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-25-at-3.02.38-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-25-at-3.02.38-PM-1-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-25-at-3.02.39-PM-1024x576.jpeg)