మత్స్యకారుడు లోకేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: దాసరి రాజు
ఇచ్చాపురం నియోజకవర్గం: ఇసుకల పాలెంనకు చెందిన మత్స్యకారుడు కోనేరు లోకేష్ ఉపాధి కోసం చెన్నై వలస వెళ్లి అక్కడ అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ దాసరి రాజు స్పందిస్తూ ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ మత్స్యకార మంత్రి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పోలీస్ దర్యాప్తు చేయించాలని జనసేన పార్టీ తరపున కోరుకుంటున్నామని మరియు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుకుంటున్నామని, ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున దాసరి రాజు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-26-at-4.13.38-PM-1024x461.jpeg)