మైహోమ్ ఘటన బాధితులను పరామర్శించిన జనసేన నేతలు
హుజూర్నగర్ నియోజకవర్గం: మేలచెరువు దగ్గర ఉన్న మై హోమ్ సంస్థకు చెందిన సిమెంట్ కర్మాగారంలో కొత్తగా కడుతున్నటువంటి ప్లాంట్లో ప్రమాదవశాత్తు కార్మికులు మృతి చెందడం జరిగింది. జనసేన పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్, జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, శ్రీరామ్ తాళ్లూరి ల ఆదేశాల మేరకు, రాష్ట్ర నాయకులు రాదరం రాజలింగం సూచనల మేరకు కోదాడ నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ మేకల సతీష్ రెడ్డి, హుజూర్నగర్ ఇంచార్జ్ సరికొప్పుల నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. మిగతా బాధితులను పరామర్శించి వారికి న్యాయం జరిగే వరకూ జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ నియోజకవర్గ నాయకులు అందె శ్రీను, రాంబాబు, పవన్, మహేష్ మీసాల, రాము నాయుడు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-26-at-5.59.10-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-26-at-5.59.10-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-26-at-5.59.11-PM-1024x768.jpeg)