చోడిశెట్టి లచ్చన్నను పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్
పిఠాపురం నియోజకవర్గం: బి. ప్రత్తిపాడు గ్రామానికి చెందిన చోడిశెట్టి లచ్చన్న అనారోగ్యరిత్యా సంవత్సరకాలం నుంచి మంచానికే పరిమితయ్యారు. అనారోగ్యంతో ఉన్న లచ్చన్నను బుధవారం పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని తగిన ఆరోగ్యపరమైన సలహాలు సూచనలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బొజ్జ గోపి కృష్ణ, బొజ్జ బుల్లి రాజు, బిజెపి నాయకులు పిల్లా ముత్యాలరావు, పిల్ల వీరబాబు, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-26-at-6.19.21-PM-1024x576.jpeg)