వర్షానికి దెబ్బతిన్న రోడ్లు – జనసేన ఆధ్వర్యంలో వరినాట్లు

పెనుకొండ నియోజకవర్గం: పరిగి మండలంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు సురేష్ ఆధ్వర్యంలో అధ్వానంగా ఉన్న రహదారులపై వరినాట్లు వేసే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించ తలపెట్టారు. అదే సమయానికి పెనుకొండ శాసనసభ్యులు శంకర్ నారాయణ పరిగిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వస్తుండటంతో ఎక్కడ ఎమ్మెల్యే అసమర్థత బయటపడుతుంది అన్న భయంతో జనసేన పార్టీ మండల కన్వీనర్ సురేష్ ఇంటివద్ద పోలీసులను పహారాగా పెట్టి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సురేష్ చిన్నపల్లి గ్రామానికి వెళ్ళి మండల కన్వీనర్ సురేష్ ను పరామర్శించి, పోలీసు పహారా ముగిసిన వెంటనే జనసేన కార్యకర్తలతో కలిసి పరిగిలోని పైడేటి సర్కిల్ లోని రహదారిపై వరినాట్లు వేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు బాలచంద్ర, సంజీవ, సంజీవ మూర్తి, రంగప్ప తదితరులు పాల్గొన్నారు.