గంగవరం పోర్టు నిర్వాసిత ఉద్యోగుల నిరాహారదీక్షకు మద్దతు తెలిపిన దల్లి గోవింద రెడ్డి

గాజువాక నియోజకవర్గం, గంగవరం పోర్ట్ యాజమాన్యం అదాని గ్రూపు వారి వైఖరిని నిరసిస్తూ గంగవరం పోర్టు నిర్వాసిత ఉద్యోగులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేస్తూ తమకు దక్కవలసిన న్యాయ డిమాండ్లను పరిష్కారం చేయాలని ఈరోజు పెదగంట్యాడ గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష శనివారానికి 26వ రోజుకి చేరుకుంది. పోర్టు నిర్వాసిత ఉద్యోగులు, మహిళలు, పిల్లలు పాల్గొని ఏవైతే వాళ్లకు న్యాయ పరమైన డిమాండ్లు ఉన్నాయో అవి వేతనాల సవరణలు చేపట్టాలని, అకారణంగా తొలగించిన ఉద్యోగుల్ని వెంటనే తిరిగి తీసుకోవాలని, 29 మంది ఉద్యోగులపై పెట్టిన షరతులను వెంటనే ఉపసహరించుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆరోగ్య భద్రత కల్పించాలని తమ న్యాయమైన డిమాండ్లతో దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 64వ వార్డ్ కార్పొరేటర్ జనసేన పార్టీ జీవిఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దల్లి గోవింద రెడ్డి సంఘీభావం తెలియజేస్తూ మీ పోరాటానికి ఎల్లప్పుడూ జనసేన పార్టీ మద్దతు ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది.